ఎందుకలా ? కారణం ఏంటి ?







మనిషి బలహీనతల పై జరిగే వ్యాపారం ఈ బలహీనతలు మనిషి లో ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటాయి . కృషి బ్యాంకు ఎన్నో జీవితాల్ని మసి చేసి పొయ్యింది . కానీ ఏమైంది ? అటు పైన ఇలాంటి ఆర్థిక మోసాలు ఆగాయా? ఆగవు . ఎందుకు ? మన డబ్బు సులభం గా రెండు మూడు ఇంతలు కావాలి . ౩౦ శాతం వడ్డీ రావాలి. మూడేళ్ళలో రెట్టింపు కావాలి అనే ఆశ మనుషుల్లో ఉండడం కారణం . దీని ఆధారం చేసుకొనే తెలివైన వాడు తెలివి లేని మూర్ఖులతో బిజినెస్ పేరుతొ మోసం చేస్తూనే ఉంటాడు . ఇక్కడ కార్పొరేట్ విద్య కూడా తల్లితండ్రుల మూర్ఖపు అత్యాశ పై జరిగే బిజినెస్ . 


ఏమిటా వీక్నెస్ ? ఏమిటా అత్యాశ ?: 


మన వాడు / అమ్మాయి సృష్టి లో కెల్లా అత్యంత తెలివైన వాడు / ఆమె .  బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేయ గలరు . కావాల్సిందల్లా సరైన కోచింగ్ మాత్రమే . ఐఐటీ లోనో నీట్ లోనే సీట్ రావడం ఏంటి బోడి .. అల్ ఇండియా ఫస్ట్ రాంక్ రావాలి .. వస్తుంది .. అంత కెపాసిటీ మన వాడికి/ ఆమెకు వుంది . ..ఇదండీ .. నూటికి తొంబై మంది తల్లితండ్రుల ఆలోచన . సరిగ్గా ఇదే కార్పొరేట్ విద్య సంస్థ ల కు ఇంధనం. ఈ బలహీనతల పైనే వారి వ్యాపారం  జరుగుతుంది . పిల్లల శక్తి సామర్త్యలు ఆప్టిట్యూడ్ ఇలాంటి వాటి గురించి ఎన్ని చెప్పిన వీరికి ఒక ముక్క కూడా చెవికి ఎక్కదు . ఎక్కినా మా వాడు డిఫరెంట్ అనుకొంటారు . 


ఇప్పుడు ఇన్ని ఆత్మ హత్యలు జరుగుతున్నాయి కదా .. కార్పొరేట్ కారాగారాల్లో తమ పిల్లని బందీ చేసి.. మా వాడి ప్రతిభ అంత ఇంత అంటూ పక్కింటి వారికీ , మిత్రులకు చెబుతూ తెగ సంతోషపడుతూ , పిల్లలు ఎప్పుడైనా నెలకు ఒక సారి ఒక గంట కలిసినప్పుడు బాగా తింటున్నావా ఆరోగ్యంగా వున్నావా అని కాకుండా ఫిజిక్స్ లో ఎన్ని మార్కులు .. ఈ వారం రాంక్ ఎంత .. ఎందుకు తగ్గింది ..ఇంకా దంచి కొట్టు అను వాకబు చేసే తల్లి తండ్రులను ఒక్క సారి కలిసి అడగండి .. ఏంటి మీకు జరుగుతున్న సంఘటనలు చూస్తే మీకు  భయం వెయ్యడం లేదా అని .. " ఆబ్బె .. ఎవరో పనికి రాని పిల్లలు .. చదవడం చేతకాని పిల్లలు .. అమ్మ అబ్బా పెంపకం సరిగ్గా లేని పిల్లలు .. మానసిక బలహీనత ఉన్న పిల్లలు ఆలా చేస్తారు . మా వాడికేంటండి? జెమ్. అసలు వాడి గురించి మీకు తెలియదు . "నాన్నా! టాయిలెట్ లో కి  కూడా నేను బుక్ తీసుకొని వెళుతాను అంటాడు" అని అంటాడు .. అని మీకు లెక్చర్ ఇస్తాడు  . 


 మా వాడు / అమ్మాయి అంత ఇంత అని వూహించుకోవడమే కాదు .. అది నలుగురికి చెప్పుకొని సమ్మగా ఫీల్ అయ్యే తల్లి తండ్రులు కోకొల్లలు . గజ్జి వచ్చిన వాడు దాని పై గీకు కొంటూ ఫీల్ అయ్యే  సమ్మ తనం   కంటే ఇలాంటి వారు తమ పిల్లల గొప్పతనం నలుగురికి చెప్పుకొని ఫీల్ అయ్యే  సమ్మ తనం    ఎక్కువ . 


కాబట్టి ఇలాంటి సంఘటనలు వీరిని బాధించవు . ఇది అనవసరంగా జరిగే రాద్ధాంతం అనుకొంటారు. ఒక మంచి ఫలితాన్ని సాదించాలి అంటే కొంత కష్టం పడక తప్పదు అనుకొంటారు . బట్టి చదువుల వల్ల జరిగే నష్టం  ఇలాంటి విషయాలు ఎంత చెప్పినా  వీరి  బుర్రకు ఎక్కదు. ఆ ఇదేవో కాలక్షేపం కబుర్లు . లేదా తమ విద్య సంస్థల కు నష్టం జరుగుతుంది అని పోటీ  దారులు చెప్పే మాటలు . ఐఐటీ సీట్ కొట్టాలి .. అమెరికా కు పోవాలే .. డాలర్ లు సంపాదించాలే.. కనీసం ఒక నాలుగు ప్లాట్ లు కొనాలే.. ఇది సగటు తల్లి తండ్రి ఆలోచన . అందరు ఇలా వున్నారు అని కాదు . కానీ మెజారిటీ మాత్రమే ఇలాగె వున్నారు.. వుంటారు .. ఈ బలహీనత ఉన్నంత కాలం వీడు .. వీడు కాక పొతే వీడి అమ్మ మొగుడు .. మోసం చేస్తూనే వుంటారు .. జనాలు మోస పోతూనే వుంటారు . 


దీనికి తోడు మరో బలహీనత కూడా తల్లితండ్రులో వుంది . దీన్ని ఉపయోగించుకొనే ఢిల్లీ కోచింగ్ వాడు ఫిట్టింగ్ చేస్తుంటాడు . అదేంటంటే కన్సెషన్ . ఎలాగూ నెగటివ్ పోస్ట్ పెడుతున్నాను కదా .. ఆ వివరాలు కూడా చెబుతాను . మరో నెల రోజుల్లో అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ advertisement  లు వస్తాయి . పిల్లకు స్కాలర్షిప్ టెస్ట్ .. వారి ప్రతిభ కు పురస్కారం అని . పిల్లాడు 5  క్లాస్ లో వున్నాడు అంటే ఇక తల్లితండ్రుల్లో చలనం వచ్చేస్తుంది . అసలు చూద్దాం .. మన వాడి స్థాయి ఏంటో ? అయినా పొయ్యింది ఏముంది ? జస్ట్ ఒక సండే రోజు ఒక ఎక్సమ్ రాసి రావడం కదా అంటూ పిల్లలని తీసుకొని ఎగ్జామ్స్ రాయించి వస్తారు . సరిగ్గా అక్కడినుంచే జగన్నాటకం మొదలు అవుతుంది . 


 ఆ పరీక్ష పేపర్ 5  వ క్లాస్ స్థాయి కాదు కదా డిగ్రీ వారికీ కూడా అందకుండా ఒక ప్లాన్ ప్రకారం సెట్ చేస్తాడు . వారం రోజుల్లో ఇంటికి కాల్ వస్తుంది . "మీ వాడు పెద్దగా రాయలేక పొయ్యాడు . కారణం ఇప్పుడు చదువుతున్న స్కూల్ లో సాధారణ అంశాలనే బోధిస్తున్నారు . ఐఐటీ పరీక్ష లో అసాధారణ అంశాలు ఉంటాయి . ఇలాంటి వి మా దగ్గరే బోధిస్తారు .  అన్నట్టు   మరో విషయమండీ.. మీ వాడి పెరఫార్మన్స్ మిగతా చాల మంది కన్నా బాగుంది .. కాబట్టి మీరు వెంటనే అడ్మిషన్స్ తీసుకుంటే ఫీజు లో యాభై శాతం డిస్కౌంట్ ఉంటుంది" అని చెబుతారు .  


వామ్మో .. మన పిల్లాడు చదువుతున్న స్కూల్ స్టాండర్డ్ ఇంత తక్కువా ?  అయినా వారు ఫీజు కన్సెషన్ ఇవ్వరు .. వీరు చూడు.... మన వాడి ప్రతిభ చూసి యాభై శాతం ఇస్తున్నారు అనుకొంటారు . తమ పిల్లాడు చదువుతున్న స్కూల్ ఫీజు ముప్పై లేదా 40  వేలు ఉంటుంది . అందులో కన్సెషన్ లేదని బాధ పడే తల్లితండ్రులు లక్షన్నర లేదా రెండు లక్షల ఫీజు లో 50  తగ్గుతుంది అనగానే యెగిరి  గెంతు      వేస్తారు . నిజానికి తాము ఇప్పుడు చెల్లిస్తున్న ఫీజు కంటే రెట్టింపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని గ్రహించలేరు . 


అయినా నాకు ఇవన్నీ ఎందుకండీ .. మా స్కూల్ విద్యార్థులు తల్లి తండ్రులు ఇలా ఆలోచించరు    . వారికి కార్పొరేట్ మోసాలు తెలుసు . పిల్లలకి సంపూర్ణాత్మక విద్య ఆవశ్యకత తెలుసు . అందుకే మా దగ్గరికి వచ్చారు .


   కేవలం మా స్కూల్ తల్లితండ్రులే కాదు .. ఇంకా చాలా మందికి ఇలాంటి విషయాల పై అవగాహన వుంది . లేని వారికీ నేను పైన చెప్పిన బలహీనతలు కలిగిన తల్లి తండ్రులకు ఎంత చెప్పినా బూడిద లో పోసిన పన్నీరే . వారి లో నేను చెప్పినా బలహీనతలు ఉన్నంత కాలం మోసపు వ్యాపారాలు జరుగుతుంటాయి . వారి కడుపున పుట్టినందుకు పిల్లలు శిక్షను అనుభవిస్తారు . బాధాకరమైన విషయం ఏమిటంటే యిలాంటి తల్లితండ్రుల సంఖ్య ఇప్పటికి అత్యధికం గా ఉండడం . ఇలాంటి వారి సంఖ్య క్రమేపి తగ్గుతూ ఉండడమే కాస్త హోప్ ని కలిగించే అంశం . నా ఈ పోస్ట్ అలాంటి హోప్ తో పెట్టిందే . 


మారాలి .. తల్లితండ్రుల వైఖరి మారాలి ..

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE