Posts

Showing posts from February, 2022

Control over NSE

చిత్రా రామకృష్ణ. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘విమన్‌ ఆఫ్ ది ఇయర్‌’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గ‌తం. ఇప్పుడామె సెబీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. ఆమెపై నిషేధ‌మూ ఉంది. శాల‌రీలో కొంత భాగం ఆపేశారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిల‌బ‌డ‌టానికి కార‌ణం.. ఓ హిమాల‌య యోగి. ఆమె చెబుతున్న 'అదృశ్య' స్టోరీ.  చిత్రా కెరీర్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ త‌ర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మ‌ళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయ‌గా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. 2009లో చిత్ర.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు.  20 ఏళ్ల‌ పాటు ఎన్‌ఎస్‌ఈకి వ‌ర్క్ చేసిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్య...

మేకప్

_*కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు ...?*_   మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు. ఆమె చేతి గడియారం తప్ప మరే ఇతర నగలు ధరించలేదు. చాలా మంది విద్యార్థులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆమె ఫేస్ పౌడర్ కూడా ఉపయోగించలేదు.ప్రసంగం ఆంగ్లంలో ఉంది. ఆమె ఒకట్రెండు నిముషాలు మాత్రమే మాట్లాడింది, కానీ ఆమె మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. అనంతరం చిన్నారులు కలెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్ర: మీ పేరు ఏమిటి? నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. ఇంకేమైనా అడగాలా? ఒక సన్నని అమ్మాయి ప్రేక్షకుల నుండి లేచి నిలబడింది. అడగండి.. "మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?" కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది.  ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది.  తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. అప్పుడు ఆమె నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో స...

PRC Katha

మిత్రమా! మనం మోసపోయామా? కావచ్చు. అంతా ఆటలో భాగమే. నో రిగ్రెట్స్. శాపనార్ధాలొద్దు. ఆర్తనాదాలు అసలే వద్దు. ఏముంది వాటి వల్ల ప్రయోజనం? గతంలో లేనివి ఈ పి ఆర్ సీ సందర్భంగా ఏం సాధించాం మనం?  బహుశా ఏమీ సాధించలేకపోయాం.ఉన్నవి కూడా పోగొట్టుకున్నాం.   62పదవీ విరమణ మనం సాధించుకున్నది కాదు, అసలు మనం కోరినదీ కాదు,తమ వెసులుబాటు కోసం ప్రభుత్వం తనంత తానుగా కొసరినదే.    గత పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను, అలవెన్సులను నిలుపుకోలేకపోయాం. ‘ప్రస్తుత ఆర్ధికస్థితి’ బాగోలేదని చెబుతూ ‘శాశ్వత నష్టం’ కలిగేలా చేసిన మార్పులను అడ్డుకోలేక పోయాం.  సీ పీ ఎస్ సోదరులకు చేసిన వాగ్దానం సంగతేమిటని గట్టిగా అడగనైనా అడగలేకపోయాం. (కాకపోతే ఒకటి. “మీకు పెంచాం. కావాలంటే పే స్లిప్పులు చూసుకోండి” అని ఎవడూ అనడేమో ఇప్పుడు.) ఈ సందర్భంగా మనకెదురైన అనుభవాలు అమూల్యమైనవి.వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలి. నువ్వు ప్రశ్నించడం మొదలుపెట్టగానే నీ నైతికతను చర్చల్లోకి లాగారు చూశావా? ఎక్కడో బీహార్ చత్తీస్గడ్ లలోని ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడి టీచర్లపై ద్వేషం పెంచాలని చూశారు చూశావా? తమకు అనుకూలంగా వీడియోలను కత్తిరించుకుని...