ఆశయం
"నేను విధవరాలినే చేసుకుంటాను' అన్నాడుశివయ్య దృఢంగా. “ఏం? ఎందుకని? అడిగాడు స్వామి. స్వామి అడిగిన ప్రశ్నకు శివ కొంచెంసేపు మౌనం వహించాడు. స్వామే మళ్ళీ “ఎందుకు విధవరాలిని చేసుకోవాలనుకుంటున్నావు?” అని అడిగినాడు. 'ఒకరి జీవితంలో నైనా వెలుగు నింపాలని నాఆశయం' అని జవాబిచ్చాడు శివయ్య, 'నీ దృష్టిలో ఎవరైనా వున్నారా?” అడిగాడు స్వామి. అవునన్నట్లు తలూపినాడు శివయ్య. 'ఎవరామె, ఏ పేరు?" “అక్షరాస్యతా ఉద్యమంలో కళాకారిణిగా పనిచేసింది. పల్లెపల్లెలో చదువు అవసరాన్ని చెపుతూ ప్రచారం చేసే కళాబృందాలు ప్రభుత్వ సారధ్యంలో ఉండేవి. జనవిజ్ఞాననివేదిక కళాకారుల్ని సమకూర్చేది. కళాకారుల్లో ఒకామె చురుకుగా కలివిడిగా ఉండేది. ఆమె పేరు ఇంద్రాణి"చెప్పినాడు శివయ్య. శివయ్య, స్వామి ఇద్దరూ మంచి మిత్రులు. స్వామి ఇరవై ఏళ్ళనుంచి యంగ్ ఇండియా అనే సంస్థలో చాలా పదవులను నిర్వహిస్తూ వస్తున్నాడు. శివయ్య విద్యార్థి దశనుంచి నేరుగా ఆ సంస్థ లోకి ప్రవేశించి రెండేళ్ళయింది. శివయ్య స్వామి తో సన్నిహితంగా వుంటాడు. శివయ్య పట్ల స్వామికి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే స్వామి శివయ్యకు “శివా నువు మంచి అమ్మాయిని చూసుకుని పెళ్...