Posts

Showing posts from April, 2021

స్వదేశీయం.....

         28 సంవత్సరాల తరువాత జరిగిన న్యాయం !             సిస్టర్ అభయ!  ఈమె 1992, మార్చి 27 న అనుమానాస్పదంగా మరణించింది.అప్పుడు దాన్ని ఆత్మహత్య అన్నారు.కాని 28  సంవత్సరాల తరువాత  అంటే 2020  ,డిసెంబరు 22 న ఆమె ఆత్మహత్య చేసుకోలేదు ఇది హత్య అని జడ్జిమెంట్ వచ్చింది.         అసలు ఏమీటి సిస్టర్ అభయ కేసు ?          అభయ 19( సంవత్సరాలు )కేరళ కొట్టయంలో DCM కళాశాలలో ప్రి డిగ్రీ చదువుతుండేది.catholic Women's Hostel లో ఉండేది.1992, మార్చి 27 తనకు పరీక్ ఉండటంతో ఉదయం 4 గం.లేచింది చదువుకోవాలని. కాసేపటికి దప్పిక వేసింది.రూం మేట్ సిస్టర్ సెరీల్  వద్దని చెప్పనా చాలదప్పిక కావడంతో down floor ,cellar లో ఉండే కిచెన్ కువెళ్ళింది.లైట్ వేయగానే అక్కడ ఫాదర్ థామస్ కొట్టూర్,సిస్టర్ షెఫి,  ఫాదర్ జోసెఫ్ పుత్రకాయ్ లను అభ్యంతరకర రీతిలోచూసింది.ఈ హఠాత్పరిణామానికి ఆముగ్గురూ  అభయను పట్డుకోపోగా తప్పించుకోవాలనుకునింది.కాని థామస్, పుత్రకాయ్ లు గట్టిగాఆమెను పట్టు కోగా సిస్టర్ షఫి గొడ్డల...

వంతెనపై ముసలాయన

వంతెనపై ముసలాయన                  __పిళ్లా కుమారస్వామి రోడ్డు ప్రక్కన దుమ్ముపట్టిన బట్టలతో ఇనుప ఫ్రేం కళ్ళద్దాలతో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. నదిపై నిర్మించిన వంతెనపై కార్లు, ట్రక్కులు వెళుతున్నాయి. చాలా మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు రోడ్డు ఎగువకు వెళుతున్నారు. బండిని లాగలేక లాగలేక లాగుతున్న ఎద్దులకు సాయంగా సైనికులు చక్రాలను నెడుతున్నారు. ఆ రోడ్డుపై ట్రక్కులు వేగంగా వెళుతున్నాయి. రైతులు రోజంతా పనిచేసి మోకాళ్ళ దాకా మట్టితో భారంగా ఆదుగులువేస్తున్నారు. కాని ఆ వృద్ధుడు మాత్రం ముందుకు కదలడం లేదు. అడుగు ముందుకు వేయలేనంతగా అలసిపోయి ఉన్నాడు. నేనా వంతెనను దాటాలి. శత్రువు ఎంత వరకు ముందుకు వచ్చాడో పరిశీలించాలి. ఇదంతా చేశాక మళ్లీ వచ్చేశా. ఇప్పుడా వంతెనపై ఎలాంటి బండ్లు పోవట్లేదు. నడచివెళ్లేవారు కూడా కొద్ది మందే వెళుతున్నారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం ఇంకా అక్కడే వున్నాడు. “ఎక్కడ నుండి వస్తున్నావు ?” అతన్నడిగాను. “శాన్‌కార్లోస్‌ నుండి' చెప్పాడతను. మెల్లగా నవ్వాడు. అది తన స్వంతూరు. దాని గురించి చెపుతుంటే ఏదో తెలియని ఆనందం కనిపిస్తోందతని కళ్ళల్లో. 'నేను జీవా...

శవం ఎక్కడకు వెళుతోంది?

 శవం ఎక్కడకు వెళుతోంది?  ఒక పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం కోసం వెళ్లాడో పండితుడు. పండితుడు ఆమె ఇంట్లో భోజనం  చేస్తున్నాడు. ఇంతలో ఆ ఇంటి ముందు నుంచి ఒక శవాన్ని డబ్బులు వాయించుకుంటూ ఎవరో తీసుకెళ్తున్నారు. పూటకూళ్ళమ్మ తన పని మనిషితో పిలిచి పిలిచి ఆ శవం స్వర్గానికి వెళుతుందో లేదా నరకానికి వెళుతుందో పోయి చూసి రా అని చెప్పింది. ఆ పని మనిషి చూసి వచ్చి "అది స్వర్గానికి పోయే పీనుగేమ్మా " అని చెప్పింది. భోజనం చేస్తున్న ఆ పండితుడు వారి సంభాషణ విని ఆశ్చర్యపోయాడు. ఆ శవం స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ఎలా తెలిసింది  అనుకుంటూ పూటకూళ్లమ్మ తో "పని మనిషి ఎలా చెప్పింది" అని శవం గురించి  అడిగాడు. "అదేం పెద్ద విషయం .అయ్యో, పుణ్యాత్ముడు పోయాడే అని నలుగురు అంటుంటే ఆ శవం స్వర్గానికి పోతుంది. పాపిష్టి ముండాకొడుకు సచ్చినాడా, అని నలుగురు అంటుంటే ఆపీనుగు  నరకానికి పోతుంది" అందామె. "ఔరా !ఎంత తెలివి వీరిది"అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడా పండితుడు. "నిజమే తల్లి, మీరు చెప్పింది అక్షరాల నిజం .మంచి వాళ్లకు శుభం జరిగితే ఊర్లో వారు కూడా సంతోషిస్తారు .దుర్మార్గుడు మరణిస్తే ఊర...