Posts

Showing posts from July, 2020

పాలకుడెలా ఉండాలి? (మహాభారత కథ)

Image
పాలకుడెలా ఉండాలి?                  పాండవులు, కౌరవులతో కురుక్షేత్రం లో యుద్ధం చేశారు.   కౌరవులవైపు   పోరాడిన భీష్ముడు బాగా గాయపడినాడు పాండవుల చేతిలో. కౌరవులెవరూ ఆయన్ను పట్టించుకోలేదు. పాండవ మధ్యముడు అర్జునుడు తనకు తాతైన భీష్ముని అంపశయ్యపై పడుకోబెట్టినాడు. అంపశయ్య అంటే బాణాలతో నిర్మించిన ఒక మంచం . భీష్ముడు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి కొన్ని రాజనీతి విషయాలు నేర్చుకోవచ్చని పాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు ఆయన దగ్గరకు వెళ్లాడు. ధర్మరాజు భీష్ముని కొన్ని సందేహాలుఅడుగుతానన్నాడు. భీష్ముడు అంత బాధలోనూ వాళ్ళ మీద ఉన్న  ప్రేమతో సరే నన్నాడు. “ప్రజలకు రాజు తప్పనిసరిగా ఉండాలా? తాతయ్యా?” అడిగాడు ధర్మరాజు. “ధర్మా! పూర్వం రాజు లేని రోజులు ఉండేవి. అందరూ ఉమ్మడిగా ఉండేవారు. ఎవరైనా తప్పుచేస్తే ఒక విచారణ సంఘం ఉండేది. వారంతా కలిసి దండన విధించేవారు. ఆ సంఘానికి ఒక పెద్దను ఏర్పాటుచేసుకునేవారు. ఆపెద్దే కాలక్రమంలో ఆ గణానికి (గ్రూపుకు) అధిపతి అయినాడు. అతనిని గణాధిపతి అని పిలిచేవారు. ఇలాంటి గణాధిపతులు ఒకరినొకరు కలహించుకోనేవారు...

వనమాలి

Image
వనమాలి                     నేను చేయాల్సిన పనులెన్నో ఉండగా కొత్తగా ఈ పనొకటి. ఆఫీసులో మేనేజరుగా చేసిన పనే ఇది. ఇప్పుడుమళ్లీ అదే పనే,చాలా బిజీ పనులలో ఈ కొత్తగా పని. పరిశోధనా మేనేజరు, శిక్షణ కోసం పూనాకు వెళ్లారు. వచ్చేసరికి లేటవుతుంది. అందుకే ఆయన చేయాల్సిన పని నా మీద పడింది.      ఆ పని ఏంటంటే...         ఓ పాలసీదారుడు ఐదు కోట్ల పాలసీ చేశాడు. కోటీశ్వరుడే. కానీ పాలసీ చేసి సంవత్సరం తిరక్కముందే మరణించాడు. పాలసీ చేసిన మూడేళ్లలోపే మరణిస్తే, అంత తొందరగా అతనికి మరణం ఎలా వచ్చిందో కనుక్కోవాలి.               పాలసీ చేయడానికన్నా  ముందే జబ్బులున్నాయోమో అందువల్లనే పాలసీ తీసుకున్నాడేమో పరిశోధించి నివేదిక ఇవ్వాలి. ఫైల్ ను రెండు మూడుసార్లు సంపూర్ణంగా చదివాను. అందులో అనుమానించాల్సిన విషయాలేమీ కనిపించలేదు.అతను హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ లో పని చేసే బ్రాంచిల్లో ఉండే ఎవరో ఒక ఆఫీసరు అప్పజెప్పాల్సింది. ఎందుకనో నాకు అప్పజెప్పారు.            నే...